23న ప్రజావాణి యథాతథం
ఆసిఫాబాద్రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిని యథాతథంగా నిర్వహించి వివి ధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నా రు.
‘పట్టణ అభివృద్ధికి సహకారం అందిస్తాం’
కాగజ్నగర్ రూరల్: పట్టణ అభివృద్ధికి సహకారం అందిస్తామని కాగజ్నగర్ మున్సిపల్ వైస్చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి అనిత పేర్కొన్నారు. కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతిని శనివారం అనిత–శ్రీనివాస్ దంపతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు విద్యావతి, స్వాతి, స్వప్న, భాగ్యలక్ష్మి, రాము, మహ్మద్ వసీం, బాబురావు, పోచన్న, యూసుఫ్, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.


