మద్యం చిచ్చు! | - | Sakshi
Sakshi News home page

మద్యం చిచ్చు!

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

మద్యం

మద్యం చిచ్చు!

పచ్చని కాపురాల్లో
వీళ్లకు దిక్కెవరు..?
అమాయకపు చూపులతో ఉన్న ఈ చిన్నారులు రితిక(6), రియా(3), శ్రీవర్థన్‌(1) నాన్న తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. జీవితాంతం తోడుంటానంటే.. నమ్మి వచ్చిన భార్య భారతి ఒంటరిగా మారింది. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. మద్యానికి బానిసై కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన తలండి రవి(27) చిన్న వయస్సులోనే ప్రాణాలు తీసుకున్నాడు. మార్చి 13న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనిచేసుకుంటూ బతికే కుటుంబం రోడ్డున పడింది.
● జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం! ● కట్టడి చేయని ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖ ● రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు ● ఇటీవల కౌటాల పోలీస్‌ స్టేషన్‌లో మహిళల ఫిర్యాదు

మద్యం నిషేధించాలి

మా గ్రామంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడి మద్యం అమ్ముతున్నారు. పురుషులు మద్యానికి బానిసై అప్పుల పాలవుతున్నారు. రోగాల బారినపడి మంచం పట్టారు. మత్తులో ఆత్మహత్య చేసుకుంటుండంతో సంసారాలు వీధిన పడుతున్నారు. మద్యం విక్రయాలు ఆరికట్టాలని మహిళలందరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం.

– లక్ష్మి, గురుడుపేట, కౌటాల

బానిస కావొద్దు

సరదాగా మొదలైన మద్యం అలవాటు వ్యసనంగా మారుతోంది. అతిగా మద్యం తాగితే అనారోగ్యం బారిన పడతారు. ఆల్క హాల్‌ గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు దెబ్బతింటాయి. మత్తులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. మానసికంగా ఇబ్బంది పడతారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండానికి వ్యాయమం, యోగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావొద్దు.

– సీతారాం, డీఎంహెచ్‌వో

‘మాంగళ్యం కాపాడండి సారూ..’

‘కట్టుకున్న వారు మద్యానికి బానిసై మా మంగళసూత్రాలు దూరం చేస్తున్నారని, మా మంగళ్యం కాపాడండి సారూ..’ అని ఈ నెల 7న కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన మహిళలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందించి పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటన గ్రామాల్లో ఏస్థాయిలో మద్యం ఏరులై పారుతుందో తెలుపుతోంది. గురుడుపేటలో మద్యానికి బానిసై ఇటీవల 20 మంది పురుషులు చనిపోయారని మహిళలు వాపోయారు. మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

కౌటాల(సిర్పూర్‌): జిల్లావాసులను మద్యం మత్తు పట్టిపీడిస్తోంది. సరదాగా మొదలైన ఈ అలవాటు వ్యసనంగా మారుతోంది. కుటుంబ రోజువారీ సంపాదన మొత్తం మద్యం పాలవుతుండగా.. పచ్చని సంసారాలు వీధిన పడుతున్నాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న వారు వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. కొంతమంది హత్యలు, అత్యాచారాలకు తెగబడుతుండగా.. మరికొంత మంది కాలేయ క్యాన్సర్లు, జీర్ణకోశ సంబంధ వ్యాధుల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. చికిత్స కోసం సర్వం పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

బతుకులు ఆగం..!

విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. నిత్యం తాగి వచ్చి మందుబాబులు భార్య, పిల్లలను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నారు. మత్తులో బైక్‌లు నడుపుతూ యువకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మద్యానికి బానిసై అర్ధంతరంగా ఆయువు తీసుకుంటుండటంతో వారి కుటుంబాలు ఆగమైతున్నాయి. జిల్లాలో ఏటా వందలాది మంది మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుంటున్నారు. జిల్లాలో డీ అడిక్షన్‌ కేంద్రం సెంటర్‌ ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

జిల్లాలో 32 మద్యం దుకాణాలు, మూడు బార్లు ఉ న్నాయి. ఏటా రూ.200 కోట్లకు పైగా సరుకు అ మ్ముడుపోతోంది. మండల కేంద్రాల్లో పదుల సంఖ్యలో గొలుసు దుకాణాలు ఉండగా, జిల్లావ్యాప్తంగా వాటి సంఖ్య 1200లకు పైగానే ఉంటుంది. స మీప వైన్స్‌ల్లో కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధ రలకు బెల్ట్‌ షాపుల్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు మండలాలైన కౌటాల, వాంకిడి, బెజ్జూర్‌, చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి) మండలా ల్లో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన బెల్ట్‌ దుకాణాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రా త్రిపగలు తేడా లేకుండా గ్రామాల్లో నడుస్తున్న బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం లేదు. కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలపై కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు.

ఇటీవలి ఘటనలు

ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన లేకురే రవీందర్‌(38) మద్యానికి బానిసయ్యాడు. మే 19న మద్యం మత్తులో భార్యతో గొడవపడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు.

బెజ్జూర్‌ మండలం బారెగూడ గ్రామానికి చెందిన చౌదరి ఇస్తారి(74) అనే వృద్ధుడు కుటుంబ సమస్యలతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3న మద్యం మత్తులో వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు.

దండేపల్లి మండలం కొండపల్లికి చెందిన ముత్యాల వెంకటేశ్‌(27) తిర్యాణిలో అమ్మమ్మ పోశక్క వద్ద ఉంటున్నాడు. ఈ నెల 7న వెంకటేశ్‌ మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో మద్యం తాగొద్దని ఎంత చెప్పినా వినడం లేదని అమ్మమ్మ మందలించింది. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి బస్టాండ్‌ సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ కింద గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మద్యం చిచ్చు!1
1/3

మద్యం చిచ్చు!

మద్యం చిచ్చు!2
2/3

మద్యం చిచ్చు!

మద్యం చిచ్చు!3
3/3

మద్యం చిచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement