అర్జీల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి చర్యలు

Jun 17 2025 5:01 AM | Updated on Jun 17 2025 5:01 AM

అర్జీ

అర్జీల పరిష్కారానికి చర్యలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజ లు సమర్పించి అర్జీలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన రాథోడ్‌ డబ్లీ, దివ్యాంగుడినైన తనకు ట్రైసైకిల్‌ అందించాలని పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన నందిపేట రాజయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌ రెండో క్యాంపునకు చెందిన మల్లిక అర్జీ అందించింది. తాము సాగు చేసిన భూములు ఇతరులు ఆక్రమించారని, అధికారులు న్యాయం చేయాలని దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన షెడ్యూల్‌ తెగ పర్దాన్‌ వర్గానికి చెందిన రైతులు వేడుకున్నారు. బెజ్జూర్‌ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన నిట్లూరి పార్వతి తాటిపల్లి శివారులో తనకు దళితబస్తీలో ఇచ్చిన భూమికి హద్దులు నిర్ణయించాలని విన్నవించింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామానికి చెందిన కూలీలు దరఖాస్తు అందించారు. వితంతు పింఛన్‌ అందించాలని ఆసిఫాబాద్‌ పట్టణంలోని జన్కాపూర్‌కు చెందిన అమీనా బేగం వేడుకుంది. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చెట్లు ఇళ్లపై విరిగిపడే ప్రమాదం ఉందని, వెంటనే వాటిని తొలగించాలని జన్కాపూర్‌కు చెందిన పరవీన్‌ తబస్సుం విన్నవించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చినా.. జాబితాలో తన పేరు లేదని, అధికారులు న్యాయం చేయాలని వాంకిడి మండలానికి చెందిన వెంకట్రావ్‌ అర్జీ అందించాడు.

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. పంచాయతీ, అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పింఛన్‌ ఆగింది

సదరం సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయకపోవడంతో దివ్యాంగ పింఛన్‌ మూడు నెలలుగా ఆగింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి పింఛన్‌ ఇప్పించాలి.

– వివేక్‌, నజ్రూల్‌నగర్‌, మం.కాగజ్‌నగర్‌

వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

రెబ్బెన మండలం కై రిగాంలోని రైతువేదిక వాడలో రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌ సౌకర్యం సక్రమంగా లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. రాత్రిపూట రోడ్లపై నడవలేని పరిస్థితి. డ్రెయినేజీలు లేక మురుగునీరు రోడ్లుపై నిలిచి ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతోంది. కాలనీలో సమస్యలు పరిష్కరించాలి.

– కై రిగాం మహిళలు

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

అర్జీల పరిష్కారానికి చర్యలు1
1/2

అర్జీల పరిష్కారానికి చర్యలు

అర్జీల పరిష్కారానికి చర్యలు2
2/2

అర్జీల పరిష్కారానికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement