
అభివృద్ధికి అడ్డంకిగా జీవో 49
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన జీవో 49 జిల్లా అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. జీవో నం.49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో కలిసి జీవో ప్రతులు దహనం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించి గిరిజనులు, గిరిజనేతరులు, రైతులకు తీవ్ర అన్యా యం చేశారన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు కనీస మరమ్మతులు కరువయ్యాయని, కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఆదివాసీలు ఆందోళన చేస్తున్నా గిరిజన మంత్రి సీతక్క స్పందించకపోవడం అన్యాయమన్నారు. జీవో 49 రద్దు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్, సెర్ల మురళీధర్, దీపక్ పంచదార, ప్రహ్లాద్, జయరాజ్, శ్రావణ్, ప్రసాద్గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.