
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ డైలీవేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం డీటీడీవో రమాదేవికి వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని సొంత మండలాల పరిధిలోకి బదిలీ చేయాలన్నారు. స మాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్ర త, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పించా లని డిమాండ్ చేశారు. నాయకులు వసంత్, శ్యాంరావు, రాంబాయి, సంతోష్, కమల, కోటయ్య, మాన్కు తదితరులు పాల్గొన్నారు.