
ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాల ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఇటీవల ఆసియా కప్లో బంగారు పతకం సాధించిన గెడెం సుహాసినిని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శాలువాతో సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 30 నుంచి జూన్ 1 వరకు వెస్ట్ బెంగాల్లో జరిగిన సౌత్ ఆసియా కప్ అత్యాపత్యా పోటీల్లో దేశానికి ప్రాతిని ధ్యం వహించి బంగారు పతకం గెలవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పీడీ రాకేశ్ ఉన్నారు.