జిల్లావాసికి జ్యూరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

జిల్లావాసికి జ్యూరీ అవార్డు

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

జిల్లావాసికి జ్యూరీ అవార్డు

జిల్లావాసికి జ్యూరీ అవార్డు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆసిఫాబాద్‌ మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు మసాదే లక్ష్మీనారాయణను తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ జ్యూరీ అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం రాత్రి జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జ్యూరీ అవార్డు అందుకున్నా రు. మసాదె బాపు, లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు లక్ష్మీనారాయణ 20 ఏళ్లుగా హైదరా బాద్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. రిపోర్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి పలు దినపత్రికల్లో సేవలందించారు. ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రారంభించిన ది జర్నలిస్టు కోఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీకి ప్ర స్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ‘దిల్‌’ రాజు, 2024 జ్యూరీ చైర్మన్‌ జయసుధకు కృతజ్ఞతలు తెలిపారు.

మహా ధర్నా జయప్రదం చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఈ నెల 17న హైదరా బాద్‌లో నిర్వహించే మహా ధర్నాను జయప్ర దం చేయాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్‌ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాయకులతో కలిసి మహా ధర్నా పోస్టర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సాయుధ పోలీసులతోపాటు మిలటరీ బలగాలతో క్యాంపులు పెట్టి నిరంతరం కూంబింగ్‌ ఆపరేషన్లతో ఆది వాసీలు, మావోయిస్టులపై అత్యంత క్రూరంగా హత్యాకాండ కొనసాగించడం సరికాదన్నారు. ఆపరేషన్‌ కగార్‌ వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు శ్రీనివాస్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement