ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎల్.రామ్మోహన్రెడ్డి 591వ ర్యాంక్, ఎం.డీ.నిఖత్ పర్వీన్ 868, కె.సంతోష్ 1,772, ఎం.హారిక 2,387, ఎం.మోక్షిత 3349, ఎస్.లిఖిత 4,286, జి.భరత్చంద్ర 5,470, ఎం.మన్వితశ్రీ 5,871, బి.సంయుత 6,723, అగ్రికల్చర్ విభాగంలో కె.సింధు 673, ఎం.పద్మ వచన్ 1,979, కె.హారిక రెడ్డి 2,121, విష్ణు 3,295, కె.నవ్య 4,971, టి.శ్రీలహరి 6,987, సీహెచ్.ధన్యత 9,002, షేక్ రంషా రూహి 9,136వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


