రాయచూరు రూరల్: మాన్వి–రాయచూరు రాష్ట్ర రహదారి పనులను నిబంధనల ప్రకారం చేపట్టాలని మాజీ మంత్రి బోసురాజ్, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ సూచించారు. సోమవారం సాయంత్రం మాన్వి ప్రభుత్వ అతిథి గృహంలో కేఆర్డీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అవైజ్ఞానికంగా రహదారుల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నట్లు తెలియజేశారు. రహదారి పెద్దగా నిర్మించి, మురుగు కాలువలు చిన్నగా నిర్మించడంతో వర్షాకాలంలో నీరు ఎలా ప్రవహిస్తుందని అధికారులను ప్రశ్నించారు.


