
ఆన్లైన్లో కేక్ ఆర్డర్.. బాలుడు బలి
బనశంకరి: ఇప్పుడు ఆహారాన్ని, తినుబండారాలను ఆన్లైన్లో తెప్పించుకోవడం పరిపాటైంది. ఇదే మాదిరిగా ఆన్లైన్లో ఆర్డర్ చేసి కేక్ ఆరగించిన తల్లిదండ్రులు అస్వస్థతకు గురికాగా వారి ఆరేళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరు కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు అక్కడే ఉండే బంధువులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. కేక్ కట్చేసి తినగానే వినయ్ (6) కడుపునొప్పి, వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు, వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. తల్లిదండ్రులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేపీ.అగ్రహార పోలీసులు కేసు నమోదు చేశారు. కేక్ చేసి చాలా రోజులై ఉంటుందని, దీనివల్ల ఫంగస్, బ్యాక్టీరియాతో కలుషితమై ఉంటుందని అనుమానిస్తున్నారు. డెలివరీ బాయ్, అలాగే కేక్ తెచ్చిన షాపు కోసం గాలింపు చేపట్టారు. గతేడాది అక్టోబరులో సరిగ్గా ఇలాంటి సంఘటనే భువనేశ్వరి నగరలో జరిగింది. ఐదేళ్ల ధీరజ్ అనే బాలుడు చనిపోగా, తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. పాడైన కేక్ను తినడం వల్లే ఇలా జరిగిందని తెలిసింది.
తల్లిదండ్రులకు అస్వస్థత
బెంగళూరులో సంఘటన