రెండో అంతస్తు నుంచి పడిన బాలిక | - | Sakshi
Sakshi News home page

రెండో అంతస్తు నుంచి పడిన బాలిక

Jun 19 2025 4:06 AM | Updated on Jun 19 2025 4:06 AM

రెండో అంతస్తు నుంచి పడిన బాలిక

రెండో అంతస్తు నుంచి పడిన బాలిక

కృష్ణరాజపురం: కళ్లు తిరిగి రెండో అంతస్తు నుంచి కిందపడిన ఓ బాలిక గాయపడిన ఘటన జరిగింది. కృతికా అనే 16 ఏళ్ల బాలిక నగరంలో మల్లేశ్వరం 13వ క్రాస్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కళ్లు తిరగడంతో అదుపు తప్పి కింద పడింది. అదృష్టవశాత్తు పెద్ద గాయాలు తగలలేదు. చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే అశ్వత్‌ నారాయణ ఆస్పత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు. మల్లేశ్వరం స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

చెట్టుపడి.. బ్రెయిన్‌డెడ్‌

బసవనగుడిలో చెట్టుకొమ్మ విరిగిపడి తలకు తీవ్రగాయమైన యువకుడు అక్షయ్‌ (29) బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేపట్టిన 60 గంటలైనా మెదడు స్పదించకపోతే బ్రెయిన్‌డెడ్‌గా పరిగణిస్తామని డాక్టర్లు తెలిపారు. ఆదివారం బనశంకరి మూడోస్టేజ్‌ శ్రీనివాసనగరలో బైకులో వెళుతున్న అక్షయ్‌ పై ఒక్కసారిగా చెట్టుకొమ్మ విరిగిపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా ఉన్నా తొలగించలేదని, అందుకే తమ బిడ్డకు ఘోరం జరిగిందని బీబీఎంపీ అధికారుల పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలో ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement