కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత

Jun 18 2025 3:15 AM | Updated on Jun 18 2025 3:15 AM

కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత

హొసపేటె: జిల్లాలోని హూవినహడగలి తాలూకా మాన్యర మసలవాడ గ్రామంలో కలుషిత నీరు తాగి 20 మందికి పైగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వడ్డర కాలనీలో 13 మంది, కురబగేరి కాలనీలో 7 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పవిత్ర, కెంచమ్మ, నింగరాజ అనే రోగులు హూవినహడగలిలోని అనన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రాధికను దావణగెరెలోని బాపూజీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. మిగతా వారిలో శారద, అనలమ్మ హరపనహళ్లిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు వివిధ చోట్ల చికిత్స పొందుతున్నారు. గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా మొత్తం గ్రామానికి ఒకే ఒక రక్షిత తాగునీటి యూనిట్‌ ఉంది.

ఇప్పటికీ బోరుబావి నీరే ఆధారం

మిగిలిన ఇళ్లకు నీటిని గ్రామ పరిధిలోని 5 గొట్టపు బావుల నుంచి ఇళ్లకు సరఫరా చేస్తారు. వడ్డరగేరి, కురబగేరి ప్రజలు ఇప్పటికీ గొట్టపు బావి నీటిని తాగుతున్నారు. బోరుబావి నీరు తాగడం వల్ల చేతులు, కాళ్లు నొప్పులు వస్తున్నాయన్నారు. పైగా గొట్టపు బావి పైప్‌లైన్‌ లీక్‌ అవుతూ సమీపంలోని గుంత నుంచి కలుషిత నీరు గొట్టపు బావిలోకి ప్రవహిస్తోంది. ఆ కలుషిత నీటిని తాగిన తర్వాత ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గొట్టపు బావి చుట్టూ ముళ్ల కంచె పెరిగి దాని పక్కనే ఒక పెద్ద గొయ్యి ఉంది. అక్కడ వర్షపు నీరు నిలుస్తోంది. ఈ గుంత నుంచి కలుషితమైన నీరు గొట్టపు బావిలోకి చేరుతోంది. బోరుబావి చుట్టు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించాలనే అవగాహన పీడీఓకు లేకపోయిందని గ్రామస్తులు వాపోయారు.

వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement