
భద్ర ఎడమ కాలువకు నీరు లేనట్టే
శివమొగ్గ: భద్ర జయాశయం ఎడమగట్టు కాలువలో కొత్త గేటు ఏర్పాటు పనులు జరుగుతున్నందున ఈ సీజన్లో ఎడమగట్టు కాలువలోకి నీటి విడుదల సాధ్యం కాదని భద్ర ప్రాజెక్ట్ నీటిపారుదల సలహా కమిటీ తెలిపింది. గేటు ఏర్పాటుకు దాదాపు ఒకటిన్నర నెలలు పడుతుంది. భద్ర డ్యాం ఎడమగట్టు కాలువ పరిధిలోకి వచ్చే రైతులు వరి వంటి నీటి ఆధారిత పంటలను పండించకూడదని మంగళవారం ఉత్తర్వుల్లో ప్రకటించారు. పంటలు నష్టపోతే తమ బాధ్యత కాదని నీటిపారుదల అధికారులు తెలిపారు. రైతులందరూ సహకరించాలని కోరారు. గేటు మరమ్మతులను వేసవిలోనే పూర్తి చేయవచ్చు కదా, విలువైన పంట కాలాన్ని నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు.