
ప్రకృతే మన సంపద
శివాజీనగర: రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో పర్యావరణ, వాతావరణ వైపరీత్య జాగృతి క్లబ్లను తప్పకుండా నియమించాలని ఆదేశించినట్లు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం విధానసౌధ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మంది విద్యార్థులతో కూడిన జాగృతి క్లబ్లను ఏర్పాటు చేయాలి. ప్రకృతిని కాపాడుకోవడానికి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి బడి ద్వారా మొక్కలను పెంచాలన్నారు. కర్ణాటక పెద్ద ఆస్తి మన ప్రకృతే అన్నారు. ప్లాస్టిక్ సమస్యను నిర్మూలించాలని సూచించారు. ఢిల్లీ, అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు ఉంటే, బెంగళూరులో 22–23 డిగ్రీలేనని ,ఈ వాతావరణం మన కర్ణాటక, బెంగళూరు ఆస్తి అని తెలిపారు.
సైకిల్ నుంచి పడిపోయిన డీసీఎం
ఈ సందర్భంగా మన నడక స్వచ్ఛ పర్యావరణం వైపు అనే జాతా జరిగింది. సౌధ తూర్పు ద్వారం నుంచి వివిధ కూడళ్ల కూడా నడక సాగించారు. డీసీఎం శివకుమార్ సైకిల్ తొక్కుతూ సౌధ మెట్ల వద్దకు వచ్చి ఆగే సమయంలో పట్టుతప్పి పడిపోయారు. కొన్నిక్షణాలు ఆయన అయోమయానికి లోనైనట్లు కనిపించారు. అయితే ఎలాంటి హాని కలగలేదు. సిబ్బంది ఆయన లేవడానికి సాయం చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
ప్రతి పాఠశాలలో జాగృతి
డిప్యూటీ సీఎం శివకుమార్