డబ్బులివ్వకపోతే.. దాడులే | - | Sakshi
Sakshi News home page

డబ్బులివ్వకపోతే.. దాడులే

Jun 18 2025 3:15 AM | Updated on Jun 18 2025 3:15 AM

డబ్బు

డబ్బులివ్వకపోతే.. దాడులే

జుడిషియల్‌ కస్టడీ

శివాజీనగర: డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే రేపే మీ ఇంటిపై దాడి జరుగుతుంది, సంపాదించినదంతా సీజ్‌ అవుతుంది అని బెదిరించి పబ్బం గడుపుకొన్నాడో కిలాడీ. అధికారం అండతో కంచే.. చేను మేసింది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నాడని లోకాయుక్తచే అరెస్టయిన ఆ శాఖ రిటైర్డ్‌ పోలీస్‌ హెడ్‌ కాన్‌స్టేబుల్‌ నింగప్ప విచారణలో సంచలనమైన సమాచారం లభించినట్లు వెల్లడైంది. ఎకై ్సజ్‌, బీబీఎంపీ, బీడీఏ, ఆర్‌టీఓ శాఖల ద్వారా నెలకు లక్షలాది రూపాయలను వసూలు చేసినట్లు, అతని వద్ద ఉన్న ఓ డైరీలో అన్నీ వివరంగా రాసుకొన్నట్లు తెలిసింది. డబ్బు ఇచ్చిన అధికారులకు కూడా విచారించబోతున్నారు.

50 మందికి పైనే బాధితులు

లోకాయుక్త దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ప్రభుత్వ అధికారుల నుంచి చాలాకాలంగా వసూళ్ల దందా సాగిస్తున్నాడు. చివరకు ఎలాగో బయటకు పొక్కడంతో లోకాయుక్త అధికారులు నింగప్పని అరెస్టు చేశారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ, బృందం నింగప్పని విచారిస్తోంది. అతని మొబైల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా ఎకై ్సజ్‌, బీబీఎంపీ, బీడీఏ, ఆర్‌టీఓ శాఖ అధికారుల ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్‌లు లభించాయి. ఏ అధికారి నుంచి నిందితుడు ఎంతెంత డబ్బు వసూలు చేసింది డైరీలో రాసుకొన్నాడు. ఆ డబ్బును ఉన్నతాధికారులకు పంపిణీ చేసేవాడు. ఆడిటర్‌ మాదిరిగా దీనంతటినీ ఓ పుస్తకంలో నమోదు చేసేవాడు. వసూళ్ల డబ్బును బిట్‌ కాయిన్‌, ఆస్తుల కొనుగోలు, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు నోరు విప్పాడు. ఇప్పటి వరకు 50 మందికి పైగా అధికారులను బెదిరించి డబ్బు గుంజాడని చెప్పాడు. నిందితుని బ్యాంకు అకౌంట్లు, ఆన్‌లైన్‌ చెల్లింపుల మీద తనిఖీ సాగుతోంది.

ఇచ్చినవారికి గుండె దడ

బెదిరింపులకు భయపడి నింగప్పకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల చిట్టా సేకరించిన లోకాయుక్త అధికారులు త్వరలో నోటీస్‌ జారీచేసి విచారించడానికి సిద్ధమయ్యారు. డబ్బు ఇచ్చినట్లు రుజువైతే కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ అధికారుల నుంచి

భారీగా వసూళ్లు

రిటైర్డు పోలీసు నింగప్ప కేసులో సంచలనాలు

వసూళ్ల సొమ్ము అధికారులకు పంపిణీ

లోకాయుక్త చేతిలో మొబైల్‌ఫోన్‌,

పద్దుల చిట్టా

లోకాయుక్త అధికారుల ఆధీనంలో ఉన్న నిందితుడు నింగప్పను జూన్‌ 30 వరకు జుడిషియల్‌ కస్డడీకి ఆదేశించారు. పోలీస్‌ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. నిందితున్ని మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని లోకాయుక్త న్యాయవాది కోరారు. ఇందుకు నిందితుని వకీలు అభ్యంతరం తెలిపారు. చివరకు జుడిషియల్‌ కస్టడీకి ఆదేశించడంతో జైలుకు తరలించారు.

డబ్బులివ్వకపోతే.. దాడులే1
1/2

డబ్బులివ్వకపోతే.. దాడులే

డబ్బులివ్వకపోతే.. దాడులే2
2/2

డబ్బులివ్వకపోతే.. దాడులే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement