వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత | - | Sakshi
Sakshi News home page

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత

Jun 18 2025 3:15 AM | Updated on Jun 18 2025 3:15 AM

వేధిస

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత

సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు రెండు నెలలు ముగిశాయి. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు అయింది. ప్రతి ఏటా ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు అరకొర బోధనే సాగుతోంది. 10వ తరగతి పరీక్షల్లో ప్రతి ఏటా జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఓ వైపు తగ్గిపోతుంది. ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 40 శాతం మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధనకు అద్దం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా 720 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 1900, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దాదాపు 500 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్‌, సైన్స్‌ ఉపాధ్యాయుల కొరత మరింత వేధిస్తోంది. ప్రతి ఏటా అతిథి ఉపాధ్యాయులతో అష్టకష్టాలతో విద్యాబోధన నెట్టుకొస్తుండటంతో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల బోధన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 5 తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు దాదాపు 2,90,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

సమస్యను పట్టించుకోని అధికారులు

ఈ నేపథ్యంలో విద్యార్థుల కొరత వేధిస్తుండటంతో ఉపాధ్యాయులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి విద్యా బోధన, పాఠశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాలు మెరుగు పరచాలని, పెంచాలని పాలకులు, అధికారులు చెబుతున్నారే కానీ కనీసం ఉపాధ్యాయులను నియమించక పోతే ఫలితాలు ఎలా మెరుగు పరచాలన్నది వారికే తెలియాలి. 5వ తరగతి నుంచి ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీవ్రం కావడం వల్ల విద్యార్థులకు ఇంగ్లిష్‌, సైన్స్‌, లెక్కలు సబ్జెక్ట్‌లలో పట్టు లేకుండా పోతుంది. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను అశ్రయిస్తే అక్కడ సరైన విద్యాబోధన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య విద్యార్థులకు దక్కడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, బదిలీల సమస్య కూడా వేధిస్తోంది.

సౌకర్యాల లేమితో ఫలితాలెలా సాధ్యం?

10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించక పోతే ఎలా సాధించగలమని పేరు చెప్పని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టడంలో అధికారులు, పాలకులు సరైన చర్యలు చేపట్టడం లేదు. ప్రతిఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయుల కొరత ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపినా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒత్తిడి చేస్తున్నారే కానీ అందుకు తగినట్లు ఉపాధ్యాయుల కొరత తీర్చడంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎందుకు చొరవ తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. అష్టకష్టాలతో ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించి కొందరు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా తక్షణం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఏటా క్షీణిస్తున్న 10వ తరగతి

ఉత్తీర్ణత శాతం

జిల్లా వ్యాప్తంగా 2400 మంది

టీచర్ల లోటు

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత1
1/2

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత2
2/2

వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement