కోటె యల్లమ్మ వైభవం | - | Sakshi
Sakshi News home page

కోటె యల్లమ్మ వైభవం

Jun 16 2025 6:55 AM | Updated on Jun 17 2025 12:15 PM

మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న కోటె యల్లమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. అర్చకులు సోమప్ప నేతృత్వంలో అర్చన కై ంకర్యాలు జరిగాయి. సుప్రభాత సేవ, మహా మంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. దేవికి పంచలోహ ప్రభావళిని అలవర్చి అలంకరణ చేశారు. లక్కూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

కంతు కట్టలేదని ఇంటికి తాళం

మైక్రోఫైనాన్స్‌ ఆగడం

దొడ్డబళ్లాపురం: మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలకు కళ్లెం వేసేలా సర్కారు చట్టం తీసుకొచ్చినా మార్పు కనిపించడం లేదు. బెంగళూరు రూరల్‌లో దేవనహళ్లి తాలూకా విజయపుర పట్టణంలో మైక్రో ఫైనాన్స్‌ సిబ్బంది బరితెగించారు. కంతు కట్టలేదనే కారణంతో ఇంట్లోని కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేశారు. మునిరాజు కుటుంబం వీధినపడింది. మునిరాజు 2021లో ఎస్‌బీఎస్‌పి మైక్రో ఫైనాన్స్‌ నుంచి రూ.21 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి కంతు కడుతూ వచ్చాడు. ఈ జనవరి నుంచి ఇప్పటివరకూ 5 కంతులు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్‌ సిబ్బంది వచ్చి గొడవకు దిగారు. ఇంట్లోంచి కుటుంబాన్ని పంపించి తాళం వేసారు. ఇంట్లోని వస్తువులు కూడా తీసుకోనివ్వలేదు. ఇద్దరు కూతుళ్లు, భార్యతో మునిరాజు వీధిన పడ్డాడు.

నీలకంఠేశ్వర రథోత్సవం

తుమకూరు: తుమకూరు నగరంలోని హోరపేటె మెయిన్‌రోడ్డులో వెలసిన చరిత్ర ప్రసిద్ధ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి 106వ వార్షిక జాతర మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కురిహినశెట్టి సముదాయికులు సహా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తేరులో శ్రీ నీలకంఠుశ్వర స్వామివారిని ప్రతిష్టించి ఊరేగించారు. పట్టణ వీధుల్లో ఘనంగా తేరు వేడుక సాగింది. నగర ఎమ్మెల్యే జీబీ జ్యోతిగణేష్‌ పాల్గొని పూజలు నిర్వహించారు.

హనుమాన్‌ పల్లకీ సేవ

మైసూరు: జిల్లాలోని హుణసూరులో హనుమంతోత్సవ సమితి, అంజనాద్రి ట్రస్టు ఆధ్వర్యంలో హనుమాన్‌ పల్లకీ సేవను నిర్వహించారు. మైసూరు రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతి నెలా పున్నమి వేడుకల సందర్భంగా ఆదివారం ఆలయంలో వివిధ రకాల పూజలు, అభిషేకం నిర్వహించారు. భక్తులు హనుమాన్‌ చాలీసా పఠనం చేశారు. 25వ పున్నమి వేడుక సందర్భంగా హనుమాన్‌ని పల్లకీలో ఆసీనుల్ని చేసి ఊరేగించారు.

దత్తపీఠానికి గిన్నిస్‌ రికార్డు

బోన్సాయ్‌ వన ఘనత

మైసూరు: ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మైసూరులోని దత్తపీఠం గిన్నిస్‌బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది. బోన్సాయ్‌ చెట్ల సేకరణలో రికార్డు సృష్టించినట్లు గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. ఆశ్రమంలో బోన్సాయ్‌ వనాన్ని 2006లో స్వామి ప్రారంభించారు. వేలాదిగా అపురూపమైన బోన్సాయ్‌ చెట్లు ఇందులో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి వాటిని తీసుకొచ్చారు. తరచూ బోన్సాయ్‌ ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం 10,836 బోన్సాయ్‌ చెట్లు ఉన్నాయి. పూణెలో ఓ వనంలో 3,333 బోన్సాయ్‌ చెట్లున్నాయి. ఆ రికార్డును ఆశ్రమం అధిగమించింది. ఆదివారం గిన్నిస్‌బుక్‌ ప్రతినిధి రికార్డును స్వామికి అందజేశారు.

దత్తపీఠానికి గిన్నిస్‌ రికార్డు1
1/3

దత్తపీఠానికి గిన్నిస్‌ రికార్డు

నీలకంఠేశ్వర రథోత్సవం2
2/3

నీలకంఠేశ్వర రథోత్సవం

కోటె యల్లమ్మ వైభవం 3
3/3

కోటె యల్లమ్మ వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement