
శారీరకంగా, మానసికంగా హానికరం
యూట్యూబ్, వాట్సాప్ ఎఫెక్టు
● అధ్యయనం ప్రకారం 12 నుంచి 14 ఏళ్ల లోపు 97 శాతం పిల్లలు యూట్యూబ్లో మునిగి తేలుతున్నారు.
● 92 శాతం పిల్లలు వాట్సాప్, 73 శాతం మంది పిల్లలు సెర్చ్ ఇంజన్ వినియోగిస్తున్నాని తెలిసింది.
● 15 నుంచి 18 వయసున్న పిల్లలు 25 శాతం మంది ప్రతిరోజూ సుమారు సగటున ఒక గంటకు మించి మొబైల్తో గడుపుతున్నారు.
● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల్లో 16 శాతం మంది అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయడానికి వెనుకాడడం లేదు. అందులో 10 శాతం మంది పిల్లలు ఆన్లైన్లో పరిచయమైనవారిని కలుసుకుంటున్నారు.
● 7 శాతం పిల్లలు ఆన్లైన్లో తమ వ్యక్తిగత సమాచారం , 2 శాతం పిల్లలు వ్యక్తిగత వీడియోలు, 8 శాతం మంది వ్యక్తిగత ఫోటోలను పంపి ఇబ్బందులో పడుతున్నారు.
● రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్, చైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ సంయుక్తంగా సర్వేని నిర్వహించాయి. ఇందులో అన్నీ ప్రతికూల అంశాలే వచ్చాయి.
● బెంగళూరు, బెళగావి, చిక్కమగళూరు, చామరాజనగర, రాయచూరు జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. 8 నుంచి 18 ఏళ్ల లోపు 900 మంది పిల్లలపై ఈ అధ్యయనం చేశారు.
● ఆన్లైన్ వినియోగం, మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటోందని, వారి మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది.
● 8–18 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో 87 శాతం మంది మొబైల్ఫోన్ను, ఇంటర్నెట్ను వాడుతున్నారు.
● 15 నుంచి 18 ఏళ్ల చిన్నారుల్లో 99 శాతం బాలురు, 100 శాతం బాలికలు మొబైల్కు పూర్తిగా అలవాటు పడినట్లు, మొబైల్ లేకపోతే రగడ చేసే స్థితికి చేరుకున్నట్లు సర్వే హెచ్చరించింది.
సాక్షి, బెంగళూరు: స్మార్ట్ ఫోన్ అనే జాఢ్యానికి చిన్నా పెద్దా వయోభేదం లేదు. అందరూ దాని ఉచ్చులో చిక్కి విలవిలలాడుతున్నవారే. ప్రమాదకర వీడియో గేమ్స్, రీల్స్, చాటింగ్లతో చాలా మంది విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయి. బెట్టింగ్, లోన్ యాప్లతో ఆర్థికంగా నష్టపోయి తనువు చాలిస్తున్నారు. కర్ణాటకలో చాలా మంది పిల్లలు గంటల తరబడి మొబైల్ఫోన్ను చూస్తూ సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చరవాణులు కాస్తా చిన్నారులకు చెర వాణిలుగా మారిపోతున్నాయి.
బాల బాలికలు ఇద్దరికీ అడిక్షన్
రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల్లో 99 శాతం మంది బాలురు, 100 శాతం బాలికలు మొబైల్ వినియోగం లేదా మొబైల్ అడిక్షన్కు లోనయి ఉన్నారు. ఆన్లైన్ లేదా మొబైల్ వినియోగం రాష్ట్ర బాలబాలికలపై చెడు ప్రభావం చూపుతోంది. ఈ చేదు విషయాలు రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనంలో తేలాయి. బాలలు, ముఖ్యంగా టీనేజీ కుర్రకారు మొబైల్కు బానిసలుగా మారుతున్నారు. వికాససౌధలో జరిగిన కార్యక్రమంలో విధాన పరిషత్ చైర్మన్ బసవరాజు హోరట్టి ఈ నివేదికను విడుదల చేశారు. గ్రామీణం, నగరం రెండు ప్రాంతాల్లోని పిల్లలపై ఈ అధ్యయనం జరిగింది. అందులో 97 శాతం మంది గ్రామీణ ప్రాంత పిల్లలు మొబైల్, ల్యాప్టాప్ను వినియోగిస్తే, నగరంలో 93 శాతం మంది పిల్లలు రెండింటినీ వాడుతున్నారు. మొత్తానికి పిల్లల్లో 8 నుంచి 11 ఏళ్ల వయసున్ను వారు 96 శాతం మంది, 15–18 ఏళ్ల లోపు పిల్లల్లో 71 శాతం మంది మొబైల్, ల్యాప్ట్యాప్ వినియోగం ఉన్నట్లు తెలిసింది.
ఆన్లైన్లో లైంగిక వేధింపులు
ఆన్లైన్ లైంగిక వేధింపుల ప్రమాదం అధికమైంది. ఈ అధ్యయనంలో పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించారు. అందులో 903 మంది తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. వారిలో 42 శాతం మంది తమ పిల్లలు ఆన్లైన్ లైంగిక వీడియోలను చూస్తున్నట్లు, లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. 43 శాతం మంది పిల్లలు ఆన్లైన్ బెదిరింపులకు లోనయ్యారు. 30 శాతం మంది చిన్నారులు లైంగిక వస్తువుల వినియోగం వంటి ఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిసింది.
దీనిని 46 శాతం కేసుల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు, మిగిలిన 27 శాతం తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా వహించి కనుగొన్నారని, అలాగే 18 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల అసహజ ప్రవర్తన ద్వారా, 9 శాతం మంది ఇతరులు తెలియజేయడం వల్ల తెలుసుకున్నట్లు ఈ అధ్యయనంలో తెలిసింది. పిల్లలపై ఆన్లైన్ లైంగిక దాడి గురించి తెలిసిన తర్వాత 50 శాతం మంది తల్లిదండ్రులు బాలబాలికల సామాజిక మాధ్యమాల ఖాతాలను రద్దు చేశారు. 46 శాతం మంది తల్లిదండ్రులు లైంగిక దాడికి యత్నించిన వారి ఖాతాలను బ్లాక్ చేశారు. మొబైల్ఫోన్ రెండోకోణాన్ని ఈ సర్వే బయటపెట్టింది.
రాష్ట్రంలో పిల్లల్లో అధిక స్మార్ట్ఫోన్ వాడకం
అపరిచితుల చేతిలో ఆన్లైన్ వేధింపులు
అనేక విపరిణామాలకు ఆజ్యం
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్
సర్వేలో నిజాలు
అడిక్షన్ అయిన 99 శాతం మంది

శారీరకంగా, మానసికంగా హానికరం

శారీరకంగా, మానసికంగా హానికరం

శారీరకంగా, మానసికంగా హానికరం