
లక్ష్మీనరసింహ జయంతి పూజలు
మైసూరు: నగరంలోని కాళిదాస రోడ్డులోని యదుగిరి యతిరాజ శాఖా మఠపు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సౌరమాన శ్రీలక్ష్మీ నరసింహ జయంతి, విశేష స్వాతిపూజ నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అలంకారం, మహా మంగళ హారతి, శాత్తుమొరై తదితర క్రతువులను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ పూజా కై ంకర్యంలో ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం సీఈఓ కేఆర్ యోగనరసింహన్, పురోహితుడు వీరరాఘవన్ ఉన్నారు.
సీఎం మార్పు ఉండదు
● మంత్రి మహదేవప్ప
మైసూరు: సీఎం కుర్చీ గట్టిగా ఉంది, దానిపై కూర్చొన్నవారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. అందువల్ల సీఎం మార్పు ఊహాగానమేనని సీఎం ఆప్తుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్సీ మహదేవప్ప అన్నారు. బుధవారం మైసూరు జడ్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్లో సీఎం మార్పు అనేది ఊహాగానమేనని, ఐదేళ్ల పాటు సిద్దరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. బళ్లారిలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడి పై స్పందిస్తూ దర్యాప్తు సంస్థలకు దాడి జరిపేందుకు రాజ్యాంగంలో అవకాశం ఉందన్నారు. ఈడీకి ఫిర్యాదు వెళ్లి ఉంటుందని, అందుకే దాడి జరిగి ఉంటుందన్నారు. గత సంవత్సరం మైసూరు దసరా ఖర్చుల వివరాలను జిల్లా అధికారులు సమర్పించలేదని, వెంటనే అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ చూస్తుందన్నారు.
కై వారంలో పౌర్ణమి పూజలు
చింతామణి: తాలూకాలోని కైవార సద్గురు యోగి నారేయణస్వామి మఠంలో జేష్టమాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత అమర నారేయణస్వామి, సద్గురు తాతయ్య ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపి తేరులో ఊరేగించారు. నాద సుధారస వేదికపైన గాయకుల సంకీర్తనలు భక్తులను అలరించాయి.

లక్ష్మీనరసింహ జయంతి పూజలు