వరుణ ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

వరుణ ప్రతాపం

Jun 11 2025 11:32 AM | Updated on Jun 11 2025 11:32 AM

వరుణ

వరుణ ప్రతాపం

రాయచూరు రూరల్‌: రాయచూరు, కలబుర్గి, బెళగావి జిల్లాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా వంతెనలు, రహదారులు జలమయమై బురద గుంటలుగా మారాయి. రాయచూరు జిల్లా మస్కి తాలూకా జిన్నాపురలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు జలమయం అయ్యాయి. పాఠశాలకు వెళ్లాలంటే మైదానం ఈత కొలనుగా మారింది. కలబుర్గి, బెళగావి జిల్లాలో కూడా వర్షాలు జోరుగా పడ్డాయి. చిక్కోడి తాలూకా చించోళి, కుడచి వంతెన పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సవదత్తి తాలూకాలో వర్షం కురవడంతో గ్రామాలు జలమయమై వాగులో బర్రెలు, వాహనాలు నీటిలోనే సంచరించాయి.

రాయచూరు, కలబుర్గి, బెళగావి జిల్లాల్లో వర్షం

మస్కిలో పాఠశాల మైదానం బురదమయం, ఆవరణలో నిలిచిన నీరు

వరుణ ప్రతాపం 1
1/2

వరుణ ప్రతాపం

వరుణ ప్రతాపం 2
2/2

వరుణ ప్రతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement