
విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!
రమణీయం.. నృత్య నివేదనం
ఆ చావులకు సీఎం కారణం
● కేంద్రమంత్రి సోమన్న విమర్శలు
మైసూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అమాయక ప్రజలు చనిపోవడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి వి.సోమన్న అన్నారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య నుంచి ఇలాంటి పరిపాలన వస్తుందని తాము అసలు ఊహించలేదని హేళన చేశారు. మీలో మీకు ఏమైనా గొడవలు ఉంటే పార్టీ పెద్దలతో కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలా విజయోత్సవాల పేరుతో ప్రజల ప్రాణాలను తీయడం సరికాదని అన్నారు. అంతమంది మరణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ధ్వజమెత్తారు. సీఎం సిద్దరామయ్య వీరి చావులకు కారణమని అన్నారు.
తొక్కిసలాటపై
స్వామీజీల ఫిర్యాదు
శివాజీనగర: ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవంలో చిన్నస్వామి మైదానం వద్ద సంభవించిన తొక్కిసలాట మీద రాష్ట్ర ప్రభుత్వ విరుద్ధంగా కొందరు స్వామీజీలు ఫిర్యాదు చేశారు. కల్బుర్గి నారాయణగురు శక్తి పీఠపు ప్రణవానంద స్వామి, కుంబార మహా సంస్థాన పీఠపు బసవమూర్తి కుంబార గుండయ్య స్వామి, చలవాది పీఠపు బసవనాగి దేవశ్రీతో పాటుగా ఇతర స్వామీజీల బృందం కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్సీబీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి కూడా ఫిర్యాదు చేయనున్నారు. నైతిక బాధ్యత వహించి సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాజీనామా చేయాలని స్వామీజీలు కోరారు. ఆర్సీబీ మీద ఇతర దేశాలవారు పెట్టుబడులు పెట్టారు, అందుచేత ఈడీ తనిఖీ చేయాలన్నారు.
హక్కుల కమిషన్ నివేదిక
తొక్కిసలాట మీద 3 సుమోటో, 2 ప్రత్యేక కేసులు నమోదు చేసుకొన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్యంలో మానవులకు మౌలిక సదుపాయాలను, భద్రత కల్పించటం అత్యంత ప్రధానమైనదని పేర్కొంది. ఘటనాస్థలాలను పరిశీలించి, గాయపడినవారిని కలిసి, వైద్యులతో మాట్లాడి నివేదికను రూపొందించారు.
మద్యం మత్తులో కింద పడి..
శివాజీనగర: ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఇంటి పై నుంచి పడి మరణించాడు, ఈ ఘటన శనివారం రాత్రి నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లత్తహళ్ళి కదంబ లేఔట్కు చెందిన నివాసి మంజునాథ్ (36) రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో రెండతస్తుల తన ఇంటి టెర్రెస్పై మద్యం తాగుతూ కూర్చొన్నారు. ఆ సమయంలో నడవబోయి అదుపు తప్పి కిందకు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయాడు. జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేశారు.
అవయవ దానంతో
ఐదుగురికి సాయం
బనశంకరి: బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవ దానంతో ఐదుమంది ప్రాణాలు దక్కాయి. అతని దేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు, గుండె తదితర ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన వారి కోసం వాయుసేన విమానంలో పలు నగరాలకు పంపించింది. సదరు రోగి నుంచి ఎయిర్ఫోర్స్ కమాండ్ ఆసుపత్రిలో అవయవాలను సేకరించి ఐదుమంది రోగులకు అమర్చడానికి పంపించారు. అవయవదానం చేసిన వ్యక్తి వివరాలను వెల్లడించలేదు.
పరిహారం అందజేత
తుమకూరు: బెంగళూరులో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన జిల్లాలోని కుణిగల్ తాలూకా అమృతూరుకు చెందిన మనోజ్కుమార్ కుటుంబానికి పరిహారం అందింది. తుమకూరు నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో మనోజ్కుమార్ తండ్రి దేవరాజ్కు రూ. 25 లక్షల చెక్ను కలెక్టర్ శుభ కళ్యాణ్ అందజేశారు.
ఆటోడ్రైవర్పై టెక్కీ
కత్తితో దాడి
బనశంకరి: మద్యం సేవించి గొడవచేస్తున్న టెక్కీ, ఆటోడ్రైవరుపై చాకుతో పొడిచాడు. ఈ ఘటన నగరంలో గోవిందపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కమ్మనహళ్లి నివాసి ఆటోడ్రైవరు రామ్కుమార్ బాధితుడు. టెక్కీ విష్ణు మద్యం మత్తులో హెణ్ణూరు జంక్షన్లో రభస చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన హోయ్సళ పోలీసులు అతడిని నిర్బంధించడానికి ప్రయత్నించారు. ఆటోడ్రైవరు రామ్కుమార్ కూడా టెక్కీని పట్టుకోవడానికి యత్నించాడు. విష్ణు చాకుతీసి రామ్కుమార్ పొట్టపై పొడిచి పారిపోతూ కిందపడి గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురైన రామ్కుమార్ గోవిందపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
బనశంకరి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనకు ఎవరు బాధ్యులు అనేది తీవ్ర చర్చలకు దారితీసింది. 11 మంది చనిపోయి, 50 మందికి పైగా గాయపడ్డారు. పోలీస్ కమిషనర్ సహా పలువురు పోలీసులను సిద్దరామయ్య సర్కారు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ దుర్ఘటనలో రోజురోజుకు కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అసలు విధానసౌధ ముందు విజయోత్సవం నిర్వహిస్తే భద్రత కల్పించడం కష్టమవుతేందని ఆ ప్రాంత డీసీపీ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులకు లేఖరాసి హెచ్చరించినట్లు వెలుగులోకి వచ్చింది. వేలాదిమంది వచ్చే అవకాశం ఉంది. బందోబస్త్ చేయడం సమస్య అవుతుంది. కొంచెం సమయం తీసుకుని భద్రత మధ్య విజయోత్సవం చేయడం మంచిదని విధానసౌధ డీసీపీ కరిబసవనగౌడ, డీపీఏఆర్ కార్యదర్శి సత్యవతి కి లేఖ రాసినట్లు వెల్లడైంది. జూన్ 4వ తేదీ ఆర్సీబీ విజయోత్సవం జరుపుతారని తెలిసి డీసీపీ వెంటనే నిర్వహించకూడదని లేఖలో పేర్కొన్నారు. ఘటనాస్థలం సమస్యాత్మకమని, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. కానీ ఆ వేడుక నిర్వహణను చూస్తున్న సిబ్బంది, పాలనాయంత్రాంగం శాఖ కార్యదర్శి జి.సత్యవతి.. గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. మ్యాచ్ ముగిసిన 24 గంటలకంటే తక్కువ అవధిలోనే వేడుకలు చేయరాదు, రద్దీ నిర్వహణ కష్టసాధ్యమని లేఖలో తెలిపారు. ఈ లేఖ అప్పటి పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాలిని రజనీశ్కు కూడా చేరిందని సమాచారం. లేఖ వ్యవహారం గురించి సీఎం సిద్దరామయ్య ఇంకా స్పందించలేదు. ప్రతిపక్షాలకు లేఖాస్త్రంగా మారింది. అయితే విధానసౌధ ముందు కార్యక్రమం ఎలాగో ముగిసింది, విషాదం చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగింది.
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
శివాజీనగర: ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట జరిగినందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి జీ.పరమేశ్వర్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం విధానసౌధ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. తొక్కిసలాట మరణాలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. నైతిక బాధ్యత వహించి వారు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్ డిమాండ్చేశారు. రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. సీఎం, డీసీఎం రాజీనామా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
నేడు గవర్నర్కు ఫిర్యాదు
రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలని గవర్నర్కు సోమవారం విన్నవిస్తామని అశోక్ తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని తొలగిస్తేనే మృతుల ఆత్మలకు శాంతి లభిస్తుందని, గవర్నర్ను భేటీ చేసి సర్కారు బర్తరఫ్కు డిమాండ్ చేస్తామన్నారు. విధానసౌధ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే భద్రత కల్పించటం కష్టమని డీసీపీ లేఖ రాశారు, అయినా కూడా కార్యక్రమం చేశారు. ఎవరిని మెప్పించేందుకు నిర్వహించారు? అని ధ్వజమెత్తారు. డీకే శివకుమార్ చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారు, అక్కడ రూ.1 కోటి విలువచేసే బాణసంచాను పేల్చారు, మీ అందరికీ మానవత్వం ఉందా అని దుయ్యబట్టారు. పోలీసులు జనం మరణాల గురించి చెప్పలేదని సీఎం చెబుతున్నారు. మీ అధికారులు మట్టిని తింటున్నారా, టీవీల్లో క్షణ క్షణం వార్తలు వస్తున్నాయి కదా అని ఎద్దేవా చేశారు.
తొక్కిసలాట మృతుల కుటుంబాల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు ఒక నెల జీతం విరాళం ఇవ్వనున్నట్లు ఆర్.అశోక్ తెలిపారు. మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరిహారాన్ని అందజేసి పరామర్శిస్తామని చెప్పారు.
హుటాహుటిన సీఎం ఇంటికి డీసీఎం, హోంమంత్రి
బనశంకరి: సీఎం సిద్దరామయ్య నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్ కు అత్యవసర పిలుపు రావడం కుతూహలం రేపుతోంది. వారు ఆదివారం అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకుని బెంగళూరులో సీఎం నివాసానికి చేరుకున్నారు. కనకపురలో ఉన్న శివకుమార్, తుమకూరులో ఉన్న పరమేశ్వర్ హుటాహుటిన వచ్చారు. స్టేడియంలో తొక్కిసలాట ఘటన గురించి చర్చించడానికేనని తెలిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాలిని రజనీశ్ కూడా పాల్గొన్నారు.
మెట్రో పిల్లర్కు సిటీ బస్ ఢీ
● ప్రయాణికుడు మృతి
యశవంతపుర: బీఎంటీసీ బస్సు మెట్రో పిల్లర్ను ఢీకొన్న ఘటనలో 12 మంది గాయపడగా వీరిలో ఒకరు మృతి చెందారు. బిడదికి చెందిన జయరామ్ (57) మృతుడు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో కెంగేరి మైలసంద్ర వద్ద బస్సు 607వ మెట్రో పిల్లర్ను అదుపుతప్పి ఢీకొంది. స్టీరింగ్ కట్ కావడమే కారణమని తెలిసింది. బస్సు ముందుభాగం నుజ్జయింది. డ్రైవర్, కండక్టర్తో పాటు 12 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి జయరాం చనిపోయాడు.
బీఎంటీసీ బస్సు ఢీకొని బైకిస్టు..
బీఎంటీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు మరణించిన ఘటన బెంగళూరు హెబ్బాళ వద్ద ఆదివారం జరిగింది. బస్సు చక్రాలు వెళ్లడంతో బైకిస్టు తల నుజ్జునుజ్జుయింది. హెబ్బాళ కళ్యాణనగర వద్ద బైకిస్టు భార్య పిల్లలతో కలిసి వెళుతుండగా వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు వారిపై దూసుకెళ్లింది. భార్య పిల్లలకు గాయాలయ్యాయి. హెబ్బాళ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.
చెరువుపాలైన యువకులు
మండ్య: మండ్య జిల్లాలోని కేఎం దొడ్డి దగ్గర హెబ్బాలలో ఈతకు వెళ్ళిన ఇద్దరు యవకులు నీట మునిగి మరణించారు. ఆలభుజనహళ్ళి గ్రామానికి చెందిన సిద్దరాజు కుమారుడు చేతన్ (16), స్వామి కుమారుడు దర్శన్ (19), ఆదివారం కావడంతో చెరువులో ఈతకు వెళ్లారు. సరిగా ఈత రాకున్నా ముందుకు వెళ్లారు, లోతైన చోట మునిగిపోవడంతో ప్రాణాలు పోయాయి. మిగతా మిత్రులు బయటకు వచ్చి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చేసరికి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. కుటుంబసభ్యులు పరుగున వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు. మృతదేహాలను బయటికి తీసి ఎలాంటి కేసు వద్దని ఇళ్లకు తీసుకెళ్లారు.
దావణగెరెలో పేలుడు శబ్ధం
దొడ్డబళ్లాపురం: దావణగెరె పట్టణంలో శనివారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చి ఏమైందోనని దిక్కులు చూశారు. పేలుడు ఎక్కడ జరిగిందీ అనేది తెలియలేదు. జగళూరు పట్టణంలో 50 ఏళ్ల తరువాత రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. విస్తరణకు అడ్డుగా చాలా చోట్ల పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయి.బహుశా వాటిని పేల్చేందుకు డైనమైట్లు పెట్టారనే అనుమానాలు కలుగుతున్నాయి.
న్యూస్రీల్
ఆర్సీబీ విజయోత్సవానికి భద్రత కష్టం
ఉన్నతాధికారులకు లేఖ రాసిన డీసీపీ
కానీ సంబరాలకు గ్రీన్ సిగ్నల్
సీఎం, డీసీఎం, హోంమంత్రి తప్పుకోవాలి
విధానసౌధ ఆవరణలో బీజేపీ ధర్నా

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!

విషాద సూచిక.. ఆకస్మిక వేడుక!