మెట్పల్లి
మెట్పల్లి(కోరుట్ల): వెల్లుల్ల రోడ్లోని ఖాదీ స్థలంలో నాలుగేళ్ల కి త్రం సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. మూడేళ్లుగా ప నులు సాగడం లేదు.
● మిషన్ భగీరథ కింద బీఆర్ఎస్ హయాంలో అన్ని వార్డుల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పటికీ పలు వార్డుల్లో వందలాది ఇళ్లకు నీటిని సరఫరా చేయడం లేదు.
● టీచర్స్కాలనీ, సాయిరాంకాలనీ, హనుమాన్నగర్, బీడీ కాలనీ, బాలకిషన్నగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవు.
● ఖాళీ ప్లాట్లు పిచ్చిమొక్కలు, వరద నీటితో ము రికిగుంటలుగా తయారయ్యాయి. ఇవి దుర్వాసన, దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి.
● కూరగాయల విక్రయాలకు ప్రత్యేకంగా స్థలం లేక వ్యాపారులు రోడ్ల పక్కనే అమ్ముతున్నారు. వారసంత కూడా ఇలాగే నిర్వహిస్తున్నారు.
● మున్సిపల్ ఆధ్వర్యంలో పలు చోట్ల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వాహణ పట్టించుకోక చాలా చోట్ల మూతపడ్డాయి.
● ట్రాఫిక్ నియంత్రణకు జాతీయ రహదారిపై పలు చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కొంతకాలంగా అవి పని చేయక ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది.
మెట్పల్లి


