సకాలంలో విత్తుకోవడమే మేలు | - | Sakshi
Sakshi News home page

సకాలంలో విత్తుకోవడమే మేలు

Jun 19 2025 4:06 AM | Updated on Jun 19 2025 4:06 AM

సకాలంలో విత్తుకోవడమే మేలు

సకాలంలో విత్తుకోవడమే మేలు

కరీంనగర్‌ అర్బన్‌: సాగులోనూ విత్తన దశ కీలకం కాగా విత్తే సమయం కూడ అత్యంత కీలకమని కరీంనగర్‌ వ్యవసాయ పరిఽశోధన స్థానం హెడ్‌డీన్‌, ప్రధాన శాస్త్రవేత్త డా.జి.మంజులత వివరించారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు పొలంబాట పడుతున్నారు. వరి నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి విత్తనాన్ని నాటుతున్నారు.. విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్‌లో ఏ పంటలు సాగు చేసుకుంటే మంచిది. సాగులో అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, చేపట్టాల్సిన విధి విధానాలపై మంజులత వివరించారు. పత్తి, వరి, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం ఈసారి వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముంది. అందుకనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే పంటల సాగును ఎంపిక చేసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు.

వివిధ రకాల ఎంపికే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement