
గ్రామసభ సందర్శన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, శాశ్వతంగా భూములు పట్టాచేయడంతో పాటు వాస్తవిక సర్వే, పహణీలో నమో దు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తామూ నివాసం ఉంటున్న గుడిసెలకు పట్టాలు లేవని, పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాస్టిన్ కులస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామసభలో 154 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ రమేశ్ తెలిపారు.
డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు
కరీంనగర్ కార్పొరేషన్: ‘డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు వేస్తాం’.. అంటూ నగరంలోని అలకాపురికాలనీ వాసులు వినూత్న నిరసన తెలిపారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్తో బుధవారం కాలనీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మ హిళలు మాట్లాడుతూ డంప్యార్డ్తో తాము సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు పాలకులు పరిష్కా రం చూపించడం లేదని ఆవేదన చెందారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నా, అధికారులు పట్టించుకో వడం లేదన్నారు. డంప్యార్డ్ సమస్య పరిష్కరించే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైన రాబోయే నగరపాలకసంస్థ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
యోగాతో జాతీయ సమైక్యత
కరీంనగర్స్పోర్ట్స్: యోగా చేయడం ద్వారా జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పతంజలి యోగా సమితి, ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన యోగావాక్ను జెండా ఊపి ప్రారంభించారు. యోగాడేను ఈనెల 21న ప్రపంచమంతా నిర్వహిస్తున్న వేళ కరీంనగర్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్, ఆయుష్ డీపీఎం ప్రవీణ్, నోడల్ ఆఫీసర్ యష్రుత్ సుల్తానా, డిప్యూటీ నోడల్ ఆఫీసర్ శేఖర్, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మి నారాయణ, భారత్ స్వాభిమాన్ బాధ్యులు కొండా లక్ష్మణ్ పాల్గొన్నారు.
సమ్మె జయప్రదం చేయండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శతాబ్దకాలంగా భా రత కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి, వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం బుధవార సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. జనగామ రాజమల్లు, కవంపల్లి రవి, ఎర్రోళ్ల రాజయ్య, ముక్కెర బుజ్జమ్మ, కత్తెరపాక లత, జేరిపోతుల మల్లేశం పాల్గొన్నారు.
24 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి
కరీంనగర్క్రైం: రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలో పనిచేస్తున్న 24 హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా పదోన్నతి పొందిన వారిలో కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీసులు ఉన్నారు.

గ్రామసభ సందర్శన

గ్రామసభ సందర్శన

గ్రామసభ సందర్శన