
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు బస్టాండు వద్ద బుధవారం పట్టుకున్నారు. వారి నుంచి 1.80 కిలలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కొంటు అనిల్కుమార్(19), సుభాశ్నగర్కు చెందిన నీర్ల వంశీకృష్ణ(25) గంజాయికి అలవాటు పడ్డారు. అరకులో గంజాయి తక్కువకు వస్తుందని అక్కడికి వెళ్లారు. రూ.5వేలు పెట్టి కొనుగోలు చేశారు. కరీంనగర్లో గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి అమ్మితే డబ్బు సంపాదించొచ్చని భావించారు. రైల్లో వరంగల్ వరకు తెచ్చారు. బస్సులో కరీంనగర్ తీసుకొచ్చారు. పక్కా సమాచారంతో బస్టాండ్ ఔట్గేటు వద్ద వన్టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులు పోలీసులను చూపి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇద్దరిని పట్టుకుని 1.80 కిలోల గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. ఎస్సైలు రాజన్న, శేఖర్, భాస్కర్రెడ్డి, సిబ్బందిని సీపీ అభినందించారు.