
మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ఇద్దరు మృతి
వేములవాడఅర్బన్: మద్యం మత్తులో కారు డ్రైవర్ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం కరీంనగర్– సిరిసిల్ల ప్రధాన రహదారిలోని రుద్రవరం స్టేజీ వద్ద బుధవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దర్శి (35) అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడు గుంటూరుకు చెందిన వ్యక్తి. బతుకుదెరువు కోసం రుద్రవరం వద్ద కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే అదే కారు ఆగకుండా కరీంనగర్ వైపు అతివేగంగా వెళ్లి ఆరెపల్లి స్టేజీ వద్ద వేములవాడ పట్టణం సుబ్రహ్మణ్యనగర్కు చెందిన మల్యాల పండరీనాథ్ (25) ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక ఉన్న చందుకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనాలను ఢీకొనడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉండగా, స్థానికులు 108లో వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాలను వేములవాడ టౌన్ ఎస్సై వెంకట్రాజం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
133.8 కిలోల గంజాయి దహనం
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని వివిధ గంజాయి కేసుల్లో సీజ్ చేసిన 133.8 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం దహనం చేశా రు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డి స్పోజల్ కమిటీ ఆధ్వర్యలో బుధవారం మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో దహనం చేశా రు. ఏసీపీలు వేణుగోపాల్, విజయ్కుమార్, ఇన్స్పె క్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ పాల్గొన్నారు.
జాతీయ అర్చరీ పోటీల్లో వెండి పతకం
విద్యానగర్(కరీంనగర్): ఉత్తరాఖండ్లో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగిన జాతీయస్థాయి అర్చరీ పోటీల్లో కరీంనగర్ ఆర్టీసీ జోనల్ వర్క్షాప్లో మెకానిక్గా పని చేస్తున్న కూన కిషన్ 50 మీటర్ల పోటీల్లో వెండి పతకం సాధించారు.ఈ సందర్భంగా కిషన్ను బుధవారం వర్క్షాప్ మేనేజర్ ప్రణీత్, అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ల శ్రీనివాసరావు, సురేందర్ అభినందించారు.

మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ఇద్దరు మృతి

మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ఇద్దరు మృతి