
ఒలింపియాడ్లో పారమిత విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్(ఐటీవో) రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పలు స్థానాలను కై వసం చేసుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. గణితంలో కె.అగస్త్య విశ్రుత్(9వతరగతి) రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, నగదు బహుమతి గెలుపొందగా, జి.ఆరుష్రెడ్డి(6వ), సాయిరిశిత్.జె(8వ) ప్రశంసాపత్రాలు, మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, వినోద్రావు, టీఎస్వీ రమణ, హన్మంతరావు అభినందించారు. కోఆర్డినేటర్లు రాము, నాగరాజు, గణిత ఉపాధ్యాయులు వీరలక్ష్మి, ప్రదీప్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.