
మానేరు రివర్ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి
కరీంనగర్: నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని, అందులో టూరిజం శాఖ రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని తెలిపారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారన్నారు. చెక్ డ్యాములు నిర్మిస్తే వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని, ఐదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆయన సీఎంకు వివరించారు.