
మందుపాతరల గణేశ్
● లెంకలగడ్డ బ్లాస్టింగ్ దేశవ్యాప్తంగా సంచలనం ● శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధిగా బాధ్యతలు ● మూడు దశాబ్దాలకుపైగా ఏకే 47తోనే చెలిమి
మంథని: గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో నక్సల్బరి విత్తనాలు మొలకెత్తిన తొలినాళ్లలో వరంగల్ రాడికల్ యువజన సంఘం ఉద్యమాల నుంచి అడవిబాట పట్టిన గాజర్ల రవి ఉ రఫ్ గణేశ్ చిన్నవయసులోనే పలు విధ్వంసాలు సృష్టించి కేంద్ర కమిటీ మన్ననలు పొందారు.
దేశంలోనే సంచలనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఉర్ఫ్ గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1993లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలోని మహాదేవపూర్, ఏటూరునాగారం పీపుల్స్వార్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే వర్గ శత్రు నిర్మాలనకు ప్రాధాన్యతనిచ్చారు. 1994 శాసనసభ ఎన్నికల టైంలో మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం లెంకలగడ్డ వద్ద శక్తివంతమైన బాంబులు అమర్చి 9 మంది పోలీస్ఽ అఽధికారులను హతమార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో ఐపీఎస్ ఐజీ స్థాయి అధికారి సాహితోపాటు ఐదుగురు పంజాబ్ కమాండోలు, మహాదేవపూర్ ఎస్ఐ వెంకటస్వామి సహా తొమ్మిది మంది మరణించారు. అప్పటి నుంచి సాహి లెంకలగడ్డ బ్లాస్టింగ్లో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది.
కీలకనేతగా ఎదిగిన గాజర్ల
లెంకలగడ్డ బాంబు బ్లాస్టింగ్ అనంతరం గణేశ్ అప్పటి పీపుల్స్వార్ పార్టీలో అత్యంత కీలకనేతగా ఏదిగారు. మందుపాతరలు పేల్చడం, ఏకే–47లో వినియోగించడంలో గణేశ్కు మరొకరు సాటిలేరు అనే ప్రచారం ఉండేది. గణేశ్ తెగువను, సమర్థవంగా అమలు చేసే వ్యూహాలను పసిగట్టిన అప్పటి పీపుల్స్వార్ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు ఆయనను రాష్ట్ర సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర తెలంగాణ వ్యవహారాలను అప్పగించింది. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాముత్తారం మండలం కనుకునూర్కు రీపోలింగ్కు బందోబస్తుకు వెళ్తున్న పోలీ్స్ సిబ్బందిపై దొబ్బలపాడు కల్వర్టు వద్ద బాంబు బ్లాస్టింగ్ చేసిన ఘటనలో 10 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. భూపాలపల్లి సమీపంలోని బాంబుల గడ్డ వద్ద పేల్చివేత వంటి సంఘటన కూడా అప్పట్లో సంచనల సృష్టించింది. 2002లో మహాదేవపూర్ పోలీస్స్టేషన్ను పేల్చడానికి బస్సును బాంబుగా అమర్చి సరికొత్త వ్యూహంతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఏవోబీ అంధ్రా–ఒడిశా బార్డర్కు కార్యదర్శిగా నియమించారు. ఇలాంటి ఎన్నో సంఽఘటనల్లో గణేశ్ పాత్ర ఉండేది. ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఆయనను కేకేడబ్ల్యూ(కరీంగర్, ఖమ్మ, వరంగల్) కార్యదర్శిగా నియమించింది. కొన్ని సంవత్సరాలు తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ముఖ్యమంత్రిగా వైస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధుల బృందంలో గణేశ్ చర్చల ప్రతినిఽధిగా పాల్గొన్నారు.
మూడు దశాబ్దాలకుపైగా ఏకే–47
మహాదేవపూర్ ఏరియా కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఏకే47 తుపాకీతోనే ఆయన స్నేహం కొనసాగింది. అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడిన గణేశ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేరారు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గణేశ్ చనిపోయినప్పుడు ఏకే–47తోనే కనిపించాడని ఆయనతోపాటు పనిచేసిన మాజీ మిలిటెంట్లు కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం.