
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం సోమన్పల్లికి చెందిన రైతు కొరండ్ల సంతోష్రెడ్డి (35) అప్పుల బాధతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కథనం ప్రకారం.. సంతోష్రెడ్డికి మూడెకరాల భూమి ఉంది. అనారోగ్యం, ఇతర సమస్యలతో అప్పులు పెరిగాయి. అతనికున్న భూమిలో రెండెకరాలు విక్రయించి అప్పు చెల్లించినా తీరకపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. సంతోష్రెడ్డికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మనోవేదనతో వృద్ధుడు..
గోదావరిఖని(రామగుండం): స్థానిక విఠల్నగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు జంగ మల్లయ్య(80) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. మల్లయ్య భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి మల్లయ్య పిల్లల వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఒక్కడే ఉంటూ మానసికంగా బాధపడేవాడు. ఈక్రమంలో తీవ్ర మనో వేధనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్క్రైం: నగరంలోని కోతిరాంపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామానికి చెందిన తిప్పర్తి రాజమౌళి కుమారుడు హరికృష్ణ(38) కరీంనగర్లోని లక్ష్మినగర్లో నివాసం ఉంటూ గోల్డ్స్మిత్గా పనిచేస్తున్నాడు. హరికృష్ణ, మరోవ్యక్తి పరిపూర్ణచారి కలిసి బైక్పై కోతిరాంపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. పరిపూర్ణచారికి తీవ్రగాయాలయ్యాయి. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ ఢీకొని ఒకరు..
మల్యాల: లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన మల్యాల మండలం రాజారాం శివారులో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు బాలయ్య, శారద కుమారుడు అల్లెపు నరేశ్(18) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. సోమవారం తన బంధువు బోదాసు రాజ్కుమార్తో కలిసి జగిత్యాల వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా రాజారం శివారుకు రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ బైక్ను వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాఽధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరేశ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజ్కుమార్ చికిత్స పొందుతున్నాడు. నరేశ్ బంధువుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ..
మెట్పల్లిరూరల్: ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల లస్మవ్వ (44) భర్త నర్సయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. గ్రామ శివారులోకి చేరగానే ద్విచక్రవాహనంపై కింద పడిపోయింది. గాయపడిన లస్మవ్వను చికిత్స నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లస్మవ్వకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
రూ.50లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి?
తంగళ్లపల్లి(సిరిసిల్ల): నమ్మిన వారిని మోసం చేసి రూ.50 లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి ఉదంతం తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ప్రధాన రహదారి పక్కన షెట్టర్ అద్దెకు తీసుకుని కొన్నేళ్లుగా బట్టలు, పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండి పద్మనగర్లో సొంతిల్లు ఉంది. అదే అదునుగా అందినకాడికి అప్పులుచేసి రాత్రికి రాత్రే బిచాన ఎత్తేశాడని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు సుమారు రూ.50లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం శోచనీయం. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య