నల్గొండ సభను విజయవంతం చేయాలి : గంగుల కమలాకర్‌ | - | Sakshi
Sakshi News home page

నల్గొండ సభను విజయవంతం చేయాలి : గంగుల కమలాకర్‌

Feb 12 2024 1:16 AM | Updated on Feb 12 2024 9:50 AM

- - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌: ఈనెల 13న నిర్వహించే చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ ఎమ్మెల్యే నివాసంలో నల్గొండ సభకు సంబంధించి కరీంనగర్‌ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటిహక్కులను హరించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్‌ఎంబీకి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్గొండలో ఈనెల 13న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు.

కరీంనగర్‌ నియోజకవర్గం నుండి 2000 మందిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. మేయర్‌ వై.సునీల్‌ రావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పాక్స్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యామ్‌ సుందర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: మోదీతోనే దేశాభివృద్ధి : బండి సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement