ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం

Jan 28 2026 6:56 AM | Updated on Jan 28 2026 6:56 AM

ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం

ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం

ధర్మారెడ్డిలో గుడిసె దగ్ధం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారెడ్డిలో పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమయింది. గ్రామంలోని దాసరి కిష్టయ్యకు చెందిన గుడిసెకు సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. వెంటనే కిష్టయ్య గ్రామస్తుల సహాయంతో మంటలను ఆర్పివేశాడు. ఈ ఘటనలో గుడిసెలోని బోరుమోటార్ల పైపులు, స్టార్టర్‌బాక్స్‌లు, వైర్లు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.60వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రమేష్‌, ముదిరాజ్‌సంఘం గ్రామ అధ్యక్షుడు నారాయణ ఘటనస్థలానికి వెళ్లి దగ్ధమైన గుడిసెను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement