సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నుంచి అరకువ్యాలీకి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. ఈ సర్వీసును ఆదివారం ప్రారంభించారు. ఈ బస్సు ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కేడీ పేట, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు అరకువ్యాలీ చేరుకుంటుందని వివరించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు అరకువ్యాలీలో బయలుదేరి, అదే మార్గంలో రాత్రి 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ఈ సర్వీసుకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. టికెట్టు ధర రూ.580గా నిర్ణయించామని చెప్పారు.


