భూపాలపల్లి అర్బన్: భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏరియాలోని కేటీకే–1, 5, 6, 8, ఓసీ–2 గనుల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక ఐక్యతతో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశ హితం–పరిశ్రమ హితం–కార్మిక హితం్ఙ అనే సిద్ధాంతంతో కార్మికుల సంక్షేమం కోసం బీఎంఎస్ నిరంతరం పనిచేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్, నర్సింగరావు, శ్రీరాములు, మల్లేష్, శ్రీనివాస్, ప్రేమ్సింగ్, శంకర్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.


