
ఎనిమిదేళ్లుగా నిరుపయోగం...
ప్రయాణికుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల క్రితం బస్టాండ్ను నిర్మించారు. ఇప్పటివరకు ఆ బస్టాండ్ను ప్రారంభించలేదు. దీంతో అక్కడికి బస్సుల రాకపోకలు సాగడం లేదు. చిట్యాల మండల కేంద్రం మీదుగా రైతులు క్రిమి సంహారక మందులు, విత్తనాల కోసం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు నిత్యం వందలాది మంది పరకాల, హనుమకొండ, భూపాలపల్లి పట్టణ ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్టాండ్ ప్రారంభించకపోవడం, బస్సులు చిట్యాల సెంటర్ నుంచే తిరిగి వెళ్తుండటంతో ప్రయాణికులు అక్కడే ఉన్న షాపుల ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.