ఔఎరువుల పెరుగుదలతో ఎకరాకు రైతుపై రూ.వెయ్యికి పైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే గిట్టుబాటు కాని ధరలు, ప్రకృతి వైపరీత్యాలతో నెట్టుకొస్తున్న రైతన్నకు పెరిగిన ధరలు గుదిబండగా మారనున్నాయి. కంపెనీలకు స్వేచ్ఛ ఇవ్వడంతో ముడిసరుకులు కొంత పెరిగినా.. ఎరువులు ధరలు భారీగా పెంచుతున్నాయి. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి
మాజీ సభ్యుడు, పూడూరు
రైతులకు అండగా నిలబడాలి
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడాలి. పెరిగిన ధరలను ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. పంట భూములు నిస్సారంగా మారుతుండటంతో పోషకాల కోసం తప్పనిసరిగ్గా ఎరువులు వేయాల్సిందే. పెరిగిన ఎరువుల ధరలతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది.
– మామిడి మహేందర్, తొంబర్రావుపేట, మేడిపల్లి


