మరమ్మతుకొస్తే మూలకే..! | - | Sakshi
Sakshi News home page

మరమ్మతుకొస్తే మూలకే..!

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

● పట్టణంలో చెత్త సేకరణకు ఆటోలు, ట్రాక్టర్‌లు, మినీటిప్పర్‌ వంటి వాహనాలు ఉన్నాయి. ● వీటికి చిన్న చిన్న మరమ్మతులు వస్తే సకాలంలో చేయించడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిధుల కొరత పేరుతో నెలల తరబడి వాహానాలను పక్కన పెడుతున్నారు. ● రెండు మినీ టిప్పర్‌ వాహనాలను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని నె లలకే అవి పాడైపోయాయి. స్థానికంగా వాటికి మరమ్మతు చేసే మెకానిక్‌లు లేకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని డిచ్‌పల్లికి తరలించారు. ● అక్కడ కొన్ని నెలల పాటు ఉంచినప్పటికీ వాటికి మరమ్మతు జరగలేదు. దీంతో తిరిగి మెట్‌పల్లికి తీసుకొచ్చి మూలనపెట్టారు. ● టెక్నాలజీపరంగా ఈ వాహనాలు మెట్‌పల్లి మున్సిపాలిటీలో పనులు చేయడానికి అనుకూలం కాదనే అభిప్రాయం ఉంది. కానీ అప్పటి అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా తమ స్వప్రయోజనం కోసం వీటిని కొనుగోలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ● పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. ● వ్యాపారాలకు ఏమాత్రం అనుకూలం కానీ ప్రాంతంలో వీటిని నిర్మించారు. దీనివల్ల వ్యాపారులు అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ● ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ షెడ్లు అధికారుల అనాలోచిత చర్యలతో మొద టి నుంచి నిరుపయోగంగానే ఉంటున్నాయి. ● కొత్తగా ఏర్పడిన పాలకవర్గమైనా నిధులు దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మెట్‌పల్లి: మన ఇంట్లో ఉన్న వస్తువు మరమ్మతుకు వస్తే ఏం చేస్తాం..?? వెంటనే బాగు చేయించి తిరిగి వినియోగంలోకి తెచ్చుకుంటాం. అలాగే దేనికై నా డబ్బులు ఖర్చు చేసే ముందు అది మనకు ఉపయోగపడుతుందా..? లేదా..? అని ఎంతో ఆలోచిస్తాం. మెట్‌పల్లి మున్సిపాలిటీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమవుతోంది. పోయేది తమ సొమ్ము కాదుకదా.. అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండడంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, చేపట్టిన నిర్మాణాలు పనికి రాకుండా పోతుండడం విమర్శలకు తావిస్తోంది.

మరమ్మతుకొస్తే అంతే...

నిర్మించారు..వదిలేశారు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లు. సుమారు నాలుగేళ్ల క్రితం వీటిని నిర్మించారు. వ్యాపారులకు ఏమాత్రమూ ఉపయోగపడని ప్రాంతంలో ఈ షెడ్లను నిర్మించడంతో అక్కడకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన షెడ్లు అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉంటున్నాయి.

వినియోగంలోకి తీసుకొస్తాం

మినీ టిప్పర్ల మరమ్మతుకు టెండర్‌ నిర్వహించాం. సంబంధిత కాంట్రాక్టర్‌ తీరుతో కొంత జాప్యం జరుగుతోంది. అతనికి నోటీసులు జారీ చేశాం. ఈ విషయాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకుపోతాం. తొందరలోనే వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– నాగేశ్వర్‌రావు, డీఈఈ

ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు మినీ టిప్పర్‌ వాహనాలను పట్టణంలో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేశారు. కొంతకాలానికి అవి పాడైపోగా.. మరమ్మతు చేయించాల్సిన బల్దియా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రస్తుతం వాటిని భగీరథ పంపుహౌజ్‌లో ఓ మూలన పెట్టేశారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలను బాగు చేయించకుండా ఇలా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వృథా అవుతున్న ప్రజాధనం

వాహనాలు నడవక ప్రజల ఇబ్బందులు

మెట్‌పల్లి బల్దియాలో వింత పరిస్థితి

నిరుపయోగంగా వ్యాపారుల షెడ్లు

Advertisement
 
Advertisement
Advertisement