ప్రతిపాదనలు పంపించాం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు పంపించాం

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

కథలాపూర్‌లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో 2,500 టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. వారి నుంచి అనుమతి రాగానే గోదాం నిర్మిస్తాం.

– రమణ, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి

ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం

మండల ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు ఉపయోగపడే వాటిపై దృష్టిసారించకపోవడం బాధాకరం. ధాన్యం నిల్వ చేయాలంటే గోదాములు అవసరమని అందరికీ తెలుసు. మండలంలో ఒక్క గోదాం నిర్మించకపోవడం దారుణం.

– బూస రమేశ్‌, రైతు, గంభీర్‌పూర్‌

క్లస్టర్‌కో గోదాం నిర్మించాలి

పంట పండించడం ఒకెత్తయితే విక్రయించడం మరో ఎత్తవుతోంది. గోదాములు లేకపోవడం సమస్యని తెలిసినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వ్యవసాయ క్లస్టర్‌కొక గోదాం నిర్మించాలి. మండలంలో ఆరు గోదాంలు నిర్మించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.

– ఏనుగు గంగారెడ్డి, రైతు, సిరికొండ

Advertisement
 
Advertisement
Advertisement