గతేడాది యూరియా బస్తాల కోసం క్యూలైన్లు కట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మేలా నిఘా ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలవాలి.
– గడ్డం సత్యనారాయణరెడ్డి, నాగారాం, ధర్మపురి
ప్రణాళిక విడుదల
వానాకాలం రైతులు, పంటల వివరాలతోపాటు వాటికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక రూపొందించాం. ప్రణాళికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాం. అవసరమైన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ, రైతులకు దిశానిర్దేశం చేయనున్నాం. – వడ్డేపల్లి భాస్కర్, డీఏవో


