ఒత్తిడికి గురికావద్దు
విద్యార్థులు పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికావద్దు. చదువుకునే సమయంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుని చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే పరిగణించాలి. స్వేచ్ఛయుత వాతవారణంలో పరీక్షలు రాయాలి.
– జి.సంతోష్కుమార్,
న్యూరో, సైకియాట్రిస్ట్
జగిత్యాల: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు భయం వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే విజయం వరిస్తుందని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు పరీక్షలంటే ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. ఆత్మ విశ్వాసమే విజయానికి పునాది అని, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.
ఒత్తిడిని తగ్గించే మార్గాలు


