
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్రీల్
మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..