పరిహారం చెల్లించండి

పంట పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
 - Sakshi

● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాలరూరల్‌: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌, అర్బన్‌ మండలం మోతెలో వర్షాలతో నష్టపోయిన పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. మోతెకు చెందిన కౌలు రైతు సంగెపు భూమయ్య.. తాను నాలుగెకరాలు కౌలుకు తీసుకుని ఎకరాపై రూ.15వేల చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగుచేశానని, అకాల వర్షాలతో పంట పూర్తిగా నేలరాలిందని రోదించాడు. చల్‌గల్‌కు చెందిన చంద భూమయ్య, చిన్నకోల భూమయ్య, బద్దం శ్రీనివాస్‌రెడ్డి పంటలు ఇదే పరిస్థితిలో ఉండగా జీవన్‌రెడ్డి వాటిని పరిశీలించారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి పంట నష్టం అంచనాలు రూపొందించాలని కోరారు. నాయకులు రాజేందర్‌, సురేశ్‌, వేణు, సతీశ్‌, గంగాధర్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

సారంగాపూర్‌(జగిత్యాల): భారీ వర్షాలు, వడగండ్లతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులు ముందుకు సాగుతారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పెంబట్లలో వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, నువ్వు పంటలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయడంలేదని, దీంతో ప్రతీ సీజన్‌లో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోతున్నారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు, ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వెంట సర్పంచ్‌ బొడ్డుపల్లి రాజన్న, నాయకులు ముద్దం చిరంజీవి, కూసరి మహేశ్‌, కోసవేని రాజేందర్‌, తోట మల్లయ్య, ముండ్ల రాజమల్లు, గంగారాం, బెజ్జెంకి రమేశ్‌, తేలు లింగారెడ్డి, కొలపాక రవి, రైతులు ఉన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top