సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!

Squirrel Attack On People Two Days Christmas Rampage UK - Sakshi

ఉడతలు మనుషులను చూస్తే భయపడుతూ! చెట్లపై తిరగటం చూస్తూ ఉంటాం. కానీ ఓ ఉడత మనుషులపై దాడులకు తెగపడి సుమారు 18మంది గాయపరిచింది. ఈ ఘటన యూకేలోని బక్లీ టౌన్‌లో చోటుచేసుకుంది. గత వారంలో ఆ ఉడత సైకోలా ప్రవర్తిస్తూ రెండు రోజులు పాటు మనుషులపై దాడికి చేసిందని ఆ దేశ మీడియా పేర్కొంది. డిసెంబర్ 26న బక్లీ రెసిడెంట్స్ ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో ఉడతకు దాడి విషయాన్ని షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నా వేలు పైన దంతాల గుర్తులు ఉన్నాయని, నాపై దాడికి చేసిన ఉడతను వదిలించుకోవడానకి ఇబ్బందిపడ్డాను.దాని దంతాలు పిన్నుల వలే ఉన్నాయి’ అని షెరీ డేవిడ్సన్ అనే స్థానికుడు చెప్పారు. క్రిస్మస్‌ సమయంలో రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఉడుత 21సార్లు దాడి చేసి 18 మందిని గాయపరిచిందని స్థానికులు పేర్కొన్నారు. అనంతరం ఆ ఉడతను పట్టుకున్నామని, అది ప్రస్తుతం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఉడతలు కూడా సైకోగా మారుతాయా?’ అని కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top