ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్‌ ర్యాలీలో ఉగ్రవాది | Saifullah Kasuri at Anti India Rally in pakistan | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడి..ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా: పాక్‌ ఉగ్రవాది

May 29 2025 4:34 PM | Updated on May 29 2025 5:39 PM

Saifullah Kasuri at Anti India Rally in pakistan

ఇస్లామాబాద్‌: మిని స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్‌ మైండ్‌ లష్కరే తోయిబా కమాండర్‌ సయిఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తేలింది. సైఫుల్లా కసూరి మరోవెరో కాదు లష్కరే తోయిబా చీఫ్‌,భారత మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకే.

పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ నాయకులే కాదు సయిఫుల్లా కసూరి, ఇతర మోస్ట్‌ వాంటెండ్‌ టెర్రరిస్టులు సైతం పాల్గొన్నారు.

పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ,‘పహల్గామ్ ఉగ్ర దాడి సూత్రదారి నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోంది’ అంటూ భారత్‌కు వ్యతిరేకంగా స్లోగన్లు వినిపించారు.

ఈ ర్యాలీలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ సైతం ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను చావుదెబ్బ తీసింది. పాకిస్తాన్‌లో ఉగ్రమూకలకు ట్రైనింగ్‌ ఇచ్చే సెంటర్లను భూస్తాపింతం జరిగింది. ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు.

తాజాగా, కసూర్‌ ర్యాలీలో మాట్లాడిన సైఫుల్లా కసూరి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో ఆస్పత్రులు, భవనాలు నిర్మిస్తామని చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement