
వాషింగ్టన్: అమెరికా తాజాగా ఇరాన్లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా, ఇజ్రాయెల్ హై అలర్ట్లో ఉన్నాయి. మూడు ఇరానియన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దరిమాలా న్యూయార్క్, వాషింగ్టన్తో సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక్కడి మతపరమైన, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాలకు అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. అలాగే కొలంబియాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు, నిఘాను పర్యవేక్షించడానికి, సమాఖ్య చట్ట అమలు భాగస్వాములతో సమన్వయ చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్లోని అణు సౌకర్యాలపై అమెరికన్ సైన్యం విజయవంతమైన దాడి నిర్వహించిందని,ఇది ప్రపంచానికి చారిత్రక క్షణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్ ఈ దాడులపై స్పందిస్తూ, అమెరికా వైమానిక దాడులో స్థానికులెవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొంది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా మరింత అప్రమత్తం అయ్యింది. దేశంలోని వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణ సమన్వయంతో ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
ఇది కూడా చదవండి: ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే..