రక్తపాతం నివారించేందుకే వెళ్లిపోయా: ఘనీ | Left Afghanistan to avoid bloodshed, 'big human disaster | Sakshi
Sakshi News home page

రక్తపాతం నివారించేందుకే వెళ్లిపోయా: ఘనీ

Aug 17 2021 3:25 AM | Updated on Aug 17 2021 3:25 AM

Left Afghanistan to avoid bloodshed, 'big human disaster - Sakshi

భారీ రక్తపాతంతో అఫ్గాన్‌ గడ్డ తడవకుండా ఉండేందుకే తాను దేశం విడిచి వెళ్లానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తెలిపారు. దేశం వదిలిపోయిన తర్వాత తొలిసారి ఘనీ తన అభిప్రాయాలను వెల్లడించారు. అధ్యక్ష భవనంలోకి వస్తున్న సాయుధ తాలిబన్లకు అడ్డుగా నిలబడడం, 20 ఏళ్లుగా రక్షించుకుంటున్న దేశాన్ని కాపాడేందుందుకు శాంతియుతంగా వెళ్లిపోవడం అనే రెండు మార్గాలు తనకు ఎదురయ్యాయని చెప్పారు. తాలిబన్లు ఆయుధాలతో విజయం సాధించారని, దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదేనని చెప్పారు. ‘ భయాందోళనలతో ఉన్న ప్రజల హృదయాలను వారు చట్టబద్ధంగా గెలవాల్సిఉంది. ప్రజలకు భరోసా ఇవ్వడంకోసం వాళ్లు ఒక ప్రణాళికను రూపొందించాలి’ అని ఘనీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement