ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతల స్వీకరణ

Aug 25 2025 9:11 AM | Updated on Aug 25 2025 9:11 AM

ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతల స్వీకరణ

ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతల స్వీకరణ

సన్మానించిన ఉద్యోగులు

విద్యారణ్యపురి: వరంగల్‌ ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌(ఎఫ్‌ ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.రంగయ్యనాయుడు ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 23న కలెక్టర్‌ సత్యశారద వరంగల్‌ ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన డీఈఓగా విధుల్లో చేరేందుకు తొలుత విముఖత వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ సుజన్‌తేజ, సూపరింటెండెంట్లు బాబ్జి, జ్యోతి, ఏఎస్‌ఓ వేణుగోపాల్‌, టీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం, జగదీశ్వర్‌ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. రంగయ్యనాయుడికి హనుమకొండ జిల్లా, వరంగల్‌ జిల్లా ఎఫ్‌ఏసీ డీఈఓగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement