మంగళగిరి: మంగళాద్రి వేంచేసివున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి అలంకారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆస్థాన అలంకారోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు స్తంభోధ్భవం అలంకారంలో దర్శనమివ్వగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులు రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావు ,శ్రీనివాసరావు,వైజాగ్కు చెందిన అంగలూరి శరకోపాచార్యులు వ్యవహరించారు. బుధవారం అలంకారోత్సోవాలలో భాగంగా కాళీయమర్ధనం అలంకారంలో స్వామి వారు దర్శనమివవ్వనున్నారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి పర్వేక్షించారు.