
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక విశేషాలపై అవగాహన
మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద ఆకట్టుకునే కటౌట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచసుందరి పోటీలపై హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మరికొద్ది రోజుల్లో పోటీలు ముగియనున్న దృష్ట్యా మిస్వరల్డ్ పోటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ పర్యాటక, చారిత్రక, వారసత్వ కట్టడాలపై ప్రజల్లో, ప్రయాణికుల్లో అవగాహన కలి్పంచేందుకు పోస్టర్లు, కటౌట్లు, చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది.
నగరంలోని గోల్కొండ, చారి్మనార్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు పోచంపల్లి, రామప్ప, లక్నవరం, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలపై ఆకర్షణీయమైన దృశ్యాలను వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరించారు. ప్రపంచసుందరి పోటీల్లో హైదరాబాద్ మెట్రో రైల్ తనవంతు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తోందని మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పోటీలపై ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారకార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణకు పరిచయం చేసేలా..
పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీ మణులను తెలంగాణకు పరిచయం చేసేవిధంగా హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు మెట్రో రైళ్లలోనూ స్క్రీన్లపై, మెట్రో స్టేషన్ ప్లాట్ఫాంలు, కాన్కోర్స్లలోనూ మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిబింబించేలా అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరీ్చలతో అలంకరించారు.
నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వారసత్వ సంపదను ప్రయాణికులకు తెలియజేసే బృహత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఎనీ్వఎస్ చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ’మెట్రో రైల్’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని ఎండీ వెల్లడించారు.