Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా! | Indian Mythological Games Shruti Ghosh Success Story | Sakshi
Sakshi News home page

శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!

Jun 26 2024 8:00 AM | Updated on Jun 26 2024 8:00 AM

 Indian Mythological Games Shruti Ghosh Success Story

పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్‌ నుంచి జెన్‌ జెడ్‌ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్‌ రూపంలో. ఇండియన్‌ మైథలాజికల్‌ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్‌ అండ్‌ ఇంటరాక్టివ్‌ మీడియా ఫండ్‌ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్‌’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...

వెల్‌కమ్‌ టు గేమ్‌ జోన్‌..
అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని శాన్వీకి గేమింగ్‌ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్‌బుక్స్‌తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్‌ ఆడడం ద్వారా రిలాక్స్‌ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్‌ డోర్‌’ నుంచి ‘మాన్‌స్టర్‌ హంటర్‌’ వరకు ఎన్నో గేమ్స్‌ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్‌ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్‌ మైథలాజికల్‌ గేమ్‌ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్‌ మాత్రమే ఆడుతోంది.

‘మైథలాజికల్‌ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ.

      ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడంతో గేమ్స్‌ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్‌ కన్జ్యూమర్‌ బేస్‌ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్‌ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్‌–క్లాస్‌ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్‌ స్టూడియోలు డెవలప్‌ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్‌జో గేమ్స్‌’ కో–ఫౌండర్‌ సౌమ్య సింగ్‌ రాథోడ్‌.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ సెక్టార్‌ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య.
      ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్‌ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్‌ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్‌ఫోఎడ్జ్‌ వెంచర్స్‌’ ఫౌండర్‌ చిన్మయ్‌ శర్మ.
      ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్‌లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్‌ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్‌ మెటావర్స్‌ సీయీవో ఉత్కర్ష్‌ శుక్లా.

మైథలాజికల్‌ గేమ్స్‌ అనేవి ఎక్కువగా ఫస్ట్‌–పర్సన్‌ షూటర్‌(ఎఫ్‌పీఎస్‌) గేమ్స్‌. మెయిన్‌ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్‌.
‘టెస్ట్‌ యువర్‌ స్కిల్స్‌ ఇన్‌ దిస్‌ ఎపిక్‌ స్ట్రాటజీ గేమ్‌’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్‌’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.

‘మైథలాజికల్‌ గేమ్స్‌ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన  పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్‌ డెవలపర్‌లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్‌ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్‌ అభాస్‌ షా.
‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్‌ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్‌ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్‌ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది.        

రాజీ పడకుండా...
నోడింగ్‌ హెడ్స్‌ గేమ్స్‌ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్‌ ఏన్‌షియెంట్‌ ఎపిక్‌’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్‌ హెడ్స్‌ గేమ్స్‌’ కంపెనీ ఫౌండర్‌ శృతి ఘోష్‌.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.

‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్‌ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్‌లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి 
ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్‌.


– శృతి ఘోష్‌

Advertisement
 
Advertisement
Advertisement